విశాఖ స్టీల్ ప్లాంట్ పై పిటిషన్.. విచారణ వాయిదా

అమరావతి : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై వివరణ వేసేందుకు సమయం కావాలని ధర్మాసనాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. దీంతో ఈ కేసు విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/