ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం జివోను కొట్టేసిన హైకోర్టు

సర్కార్ కు చుక్కెదురు

The High court of Andhra pradesh

Amaravati: ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 81, 85ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.

ఏ మాధ్యమంలో చదువుకోవాలి అన్న విషయం పిల్లలు, వారి తల్లిదండ్రులు నిర్ణయించుకుంటారంటూ జీవోను సవాల్ చేస్తూ న్యాయవాది ఇంద్రనీల్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు జీవోను కొట్టివేసింది.

ఆంగ్లమాధ్యమాన్ని తప్పని సరి చేస్తే కొందరి బ్యాక్ లాగ్ లు మిగిలిపోయే అవకాశం ఉందని న్యాయవాది తన పిటిషన్ లో పేర్కొన్నారు.

వాదనలు విన్న హైకోర్టు ఇప్పటికే తీర్పు రిజర్వు చేసిన సంగతి తెలిసిందే.

ఈ రోజు ప్రభుత్వ జీవోను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/