ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
సినిమా టికెట్ల ధరలు, థియేటర్ల వర్గీకరణపై కమిటీ… ప్రభుత్వం ఉత్తర్వులు
అమరావతి: ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై వైస్సార్సీపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొత్త కమిటీని నియమించింది. ఈ మేరకు సంబంధిత అధికారులు ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో ఉన్నతాధికారులు, ఎగ్జిబిటర్లు, సినీగోయర్లు ఉంటారు. కమిటీలో హోం, రెవెన్యూ, పురపాలక, ఆర్థిక, సమాచార, న్యాయశాఖ, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా ఉంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సినిమా థియేటర్ల వర్గీకరణ, ధరలపై కమిటీ ప్రతిపాదనలు చేయనుంది. అనంతరం ధరలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/