నేడు ఇఫార్ విందు ఇవ్వనున్న ఏపి ప్రభుత్వం

గుంటూరు: ఈరోజు ఏపి ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తారు విందు ఇవ్వనుంది. పోలీసు కవాతు మైదానంలో సాయంత్రం 6 గంటలకు ఇఫ్తారు విందు ప్రారంభం కానుంది. 4,500 మందికి విందు ఏర్పాట్లు చేశారు. అసర్ నమాజ్కు ప్రత్యేక ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. విందుకు ప్రత్యేక పాసులు జారీ చేశారు.అయితే ఈ కార్యక్రమానికి ఏపి సిఎం జగన్ కూడా హాజరుకానున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telengana/