ఏపీ రైతులకు సీఎం జగన్‌ సర్కారు శుభవార్త

రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 2వేలు

farmer
farmer

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రైతులకు ముఖ్యమంత్రి జగన్‌ సర్కారు శుభవార్త అందించింది. గురువారం వారి బ్యాంకు ఖాతాలోకి రూ.2వేలు జమ చేయనుంది. ప్రధానమంత్రి కిసాన్‌ కింద రావాల్సిన భరోసా సొమ్మును రైతు భరోసా పథకం కింద అందజేయనున్నారు. ప్రభుత్వం 46,50,629 మందికి రైతు భరోసా తుది విడత మొత్తం..రూ.1,082 కోట్లను నేరుగా బదిలీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వైఎస్సార్‌ రైతు భరోసా -పీఎం కిసాన్‌ పథకం కింద గత నెల 15 వరకు వచ్చిన దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఆ దరఖాస్తుల్ని కూడా పరిశీలించి అర్హులైన వారి ఖాతాల్లో రైతు భరోసా పెట్టుబడి సాయం జమ చేయనున్నారు. అంతేకాదు వాస్తవ సాగుదారుల, కౌలు రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌, దేవాదాయ, దర్మదాయ భూముల్ని సాగు చేసుకుంటున్న ఇతర వారికి నగదు అందజేయనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/