నేడు జగనన్న విద్యాకానుక ప్రారంభం

AP CM YS JAGAN
AP CM YS JAGAN

విజయవాడ: ఏపి సిఎం జగన్‌ ఈరోజు పెనమలూరు నియోజకవర్గంలోని పునాదిపాడులో ‘విద్యా కానుక’ పథకాన్ని ప్రారంభించనున్నారు. విద్యార్థులకు కిట్‌లో భాగంగా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, మూడు జతల యూనిఫామ్స్, బ్యాగ్, షూస్, బెల్ట్, సాక్స్‌లను సిఎం జగన్ అందజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల మందికి పైగా విద్యార్థులకు విద్యాకానుక కిట్‌లను పంపిణీ చేయనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 42,34,322 మంది విద్యార్థులకు ప్రయోజనం కలగబోతోంది. సుమారు రూ.650 కోట్ల విలువైన స్టడీ కిట్లను విద్యార్థులకు ఇస్తారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/