ఏపిలో మద్యం దుకాణాలు తగ్గిస్తూ ఉత్తర్వులు
రాష్ట్రంలో 2,934కి తగ్గిన మద్యం దుకాణాలు
అమరావతి: ఏపి ప్రభుత్వాం మద్యం దుకాణాల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రాష్ట్రంలో మద్యం షాపుల సంఖ్యను కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తగ్గించిన 20 శాతంతో కలిపి మొత్తం 33 శాతం దుకాణాలు తగ్గించినట్టయింది. తద్వారా రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య 2,934కి తగ్గింది. ఏపి సర్కారు ఇప్పటికే 40 శాతం బార్లను తొలగించింది. తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్న 13 శాతం దుకాణాలను ఈ నెలాఖరు నాటికి తొలగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/