గుంటూరులో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన డిజిపి

గుంటూరు: ఏపిలోని గుంటూరు పట్టణ పరిధిలో దిశ మహిళా పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు. ఏపి డిజిపి గౌతమ్ సవాంగ్ దిశ పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ.. మహిళల భద్రతకు పోలీస్శాఖ పెద్దపీట వేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 13 దిశ పోలీస్ స్టేషన్లు ప్రారంభించినట్లు తెలిపారు. దిశ పోలీస్ స్టేషన్లలో 50 శాతం మహిళా ఉద్యోగులను నియమించనున్నట్లు తెలిపారు.
తాజా ఇంగ్లీష్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/english-news/