రంజాన్ నెల అతి పవిత్రం

ఏపీ సీఎం వైస్ జగన్ ట్వీట్

ap cm ys jagan tweet-The month of Ramadan is the holiest
ap cm ys jagan tweet-The month of Ramadan is the holiest

అమరావతి : పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు సీఎం వైయ‌స్‌ జగన్‌ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలతో ఆచరించే రంజాన్‌ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదని పేర్కొన్నారు. మహ్మద్‌ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్‌ ఆవిర్భవించింది రంజాన్‌ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారని తెలిపారు.

ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దానధర్మాల ద్వారా ఖర్చు చేస్తారని, చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపు మాపేందుకు చేసే కఠోర దీక్షే రంజాన్‌ ఉపవాస దీక్ష అని తెలిపారు ఉపవాస దీక్షలు ఆచరిస్తున్న ప్రతి ఒక్కరికీ అల్లా దయతో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సీఎం జగన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/