ఏపీ సీఎం ఓఎస్డీ కుమారుని వివాహ వేడుకకు హాజరైన జగన్, కెసిఆర్
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ విఎన్నార్ ఫార్మ్స్ కు విచ్చేసిన ప్రముఖులు
Hyderabad: ఏపీ సీఎం ఓఎస్డీ పి. కృష్ణ మోహన్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలు శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ విఎన్నార్ ఫార్మ్స్ లో ఆదివారం ఘనంగా జరిగాయి. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, కెసిఆర్ హాజరయ్యారు. నూతన వధూ వరులను ఆశీర్వదించారు . ఏ వేడుకకు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, మంత్రులు, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/