మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం
సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ
Ysr Kadapa District: భారీ వర్షాలు, వరదల కారణంగా మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. వైయస్ఆర్ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. రాజంపేట మండలం మందపల్లి, పులపుత్తూరులో వరద బాధితులను సీఎం వైయస్ జగన్ పరామర్శించారు. బాధితులతో సీఎం ముఖాముఖి నిర్వహించి..వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అంతర్జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/international-news/