గవర్నర్తో ఏపి సిఎం జగన్ భేటి
రాష్ట్రంలో పరిస్థితులను వివరించిన జగన్
అమరావతి: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటి అయ్యారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, అందుకు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నివారణ చర్యలు, లాక్డౌన్ పరిస్థితుల గురించి పూర్తి వివరాలను గవర్నర్ కు వివరించారు. కరోనా కేసుల నమాదు, అనుమానితుల పరిస్థితి వంటి విషయాలను గవర్నర్కు తెలిపారు, అయితే ఇప్పటివరకు ఏపిలో 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/