‘దిశ’ పోలీస్ స్టేషన్ ని ప్రారంభించిన సీఎం
24 గంటలూ అందుబాటులో దిశ కంట్రోల్ రూమ్
రాజమహేంద్రవరం: ఏపీ సీఎం జగన్ ఈరోజు రాజమహేంద్రవరంలో ‘దిశ’ మహిళా పోలీస్ స్టేషన్ ని ప్రారంభించారు. కాగా 24 గంటల పాటు దిశ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉండనుంది. దిశ చట్టానికి సంబంధించి ప్రత్యేక యాప్ ను జగన్ ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, పలువురు మహిళా మంత్రులు, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/