ప్రారంభమైన ఏపి మంత్రివర్గ సమావేశం
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ
అమరావతి: సిఎం జగన్ అధ్యక్షతన ఏపి కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఏపిలో చిరు వ్యాపారులకిచ్చే ‘జగనన్న చేదోడు’ పథకానికి ఆమోద ముద్ర వేయడంతో పాటు శాసన సభ సమావేశాల తేదీల నిర్ణయం వంటి కీలక అంశాలపై కేబినెట్ చర్చిస్తోంది. ఉచిత బియ్యం డోర్ డెలివరీ, కొత్త ఇసుక విధానంపై మార్పులు, ఏపిలో భూముల రీసర్వే, విజయనగరం జిల్లా గాజులరేగలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 80 ఎకరాల కేటాయింపు వంటి అంశాలపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. అలాగే, పాడేరు మెడికల్ కాలేజీకి 35 ఎకరాల భూమి కేటాయింపునకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. మచిలీపట్నం పోర్టు డీపీఆర్పై కూడా చర్చించనున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/