సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం

అమరావతి: సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. కేబినెట్ భేటీ అజెండాలోని ప్రధాన అంశాలు ఇవే.

.ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీకి ఆమోదం
.ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడానికి ఆమోదం
.కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై చర్చ
.ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల పథకానికి ఆమోదం
.జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం కేటాయింపు
.ప్లాట్ల ధరలో ఉద్యోగులకు 20 శాతం రాయితీ, ప్లాట్ల కేటాయింపులో పెన్షనర్లకు 5 శాతం కేటాయింపుకు ఆమోదం
.పెన్షన్లను రూ. 2,250 నుంచి రూ. 2,500కు పెంచడానికి ఆమోదం
.ఈబీసీ నేస్తం అమలుకు ఆమోదం
.వీటితో పాటు మరిన్ని ఇతర అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/