కేబినేట్ లో కీలక అంశాల వివరాలు

ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన భేటీ

AP CM YS Jagan Mohan Reddy
AP CM YS Jagan Mohan Reddy

Amravati: ఆంధ్రప్రదేశ్‌ కేబినేట్‌ సమావేశం బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షత ప్రారంభమైంది. ఈసందర్భంగా పలు సంక్షేమ పథకాలు, అమలు తీరు, నిధుల కేటాయింపుపై కేబినేట్‌ ఆమోదించింది.

‘నవరత్నాలు’ లో మరో కీలక పథకానికి కేబినెట్‌ ఆమోద ముద్ర. ‘వైయస్సార్‌ ఆసరా’కు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం

ఏఫ్రిల్‌ 11, 2019 నాటికి బ్యాంకులకు బకాయిపడ్డ  డ్వాక్రా అక్కచెల్లమ్మల రుణాలను నాలుగు వాయిదాలుగా చెల్లించనున్న ప్రభుత్వం.

నాలుగేళ్లలో రూ. 27,169 కోట్లు అక్కచెల్లమ్మల చేతికివ్వనున్న ప్రభుత్వం., 2020–21 సంవత్సరానికి రూ.6792.21 కోట్లు ఇవ్వనున్న ప్రభుత్వం . దాదాపు 90 లక్షల మంది లబ్ధిదారులు

సెప్టెంబరు 5 న జగనన్న విద్యా కానుక ప్రారంభానికి కేబినెట్‌ ఆమోదం .

దాదాపు 43 లక్షల మంది విద్యార్ధులకు లబ్ధిమూడు జతల యూనిఫారమ్, నోటుబుక్స్, టెక్ట్స్‌బుక్స్, ఒక జత షూ,రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూల్‌ బ్యాగ్‌ విద్యా కానుక కింద పంపిణీ.

‘విద్యా కానుక’ కోసం రూ.648.09 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం

సెప్టెంబరు 1న వై.యస్‌.ఆర్‌. సంపూర్ణ పోషణ్‌ ప్లస్, సంపూర్ణ పోషణ్‌  ప్రారంభం

77 గిరిజన మండలాల్లో సంపూర్ణ పోషణ్‌ ప్లస్, మిగిలిన మండలాల్లో సంపూర్ణ పోషణ్‌ అమలు గర్భవతులకు, బాలింతలకు, 6 నుంచి 36 నెలల వరకు.

అలాగే 36 నుంచి 72 నెలల పిల్లలకు  పౌష్టికాహారం. ఈ కార్యక్రమాలకు ఏడాదికి రూ.1863 కోట్లు30 లక్షల మందికి లబ్ధి.

గతంలో కేవలం రక్తహీనతతో ఉన్న గర్భవతులకు, బాలింతలకు మాత్రమే ఆహారం అందించగా… ఇప్పుడు అందరు బాలింతలకు, గర్భవతులకు వర్తింపు.

గత ప్రభుత్వ కాలంలో రూ.762 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా.. ఈ ప్రభుత్వ కాలంలో మూడు రెట్లు పెంచి దాదాపు రూ.1863 కోట్లు కేటాయించి అమలు చేస్తున్నారు.

డిసెంబరు 1నుంచి లబ్దిదార్ల గడపవద్దకే తినగలిగే  నాణ్యమైన బియ్యం అందించడానికి చర్యలు

9260 వాహనాలు కొనుగోలు కోసం రుణాలు తీసుకునేందుకు సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌కు ప్రభుత్వం గ్యారంటీసార్టెక్స్‌ చేసిన నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదార్ల ఇంటి వద్దకే చేర్చేందుకు ఈ వాహనాలు వినియోగం.

60శాతం సబ్సిడీ మీద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మరియు ఈబీసీ యువకులకు స్వయం ఉపాధి కింద ఈ వాహనాలను అందిస్తారు.

వాహనాల కోసం లబ్ధిదార్లు 10 శాతం చెలిస్తే చాలు30 శాతం బ్యాంకు రుణం కాగా 60 శాతం సబ్సిడీ ఇవ్వనున్న ప్రభుత్వం.

నిరుద్యోగులైన యువకులకు ఆరేళ్ల పాటు ఈ కాంట్రాక్టు ఇవ్వనున్న ప్రభుత్వంప్రతినెలా రూ.10 వేలు ఆదాయం వచ్చేలా ఉపాధి మార్గం ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం.

దీని కోసం రూ.550 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం సార్టెక్స్‌ చేయడం వల్ల గతంలో 25 శాతం ఉన్న నూకలు 15 శాతానికి తగ్గనుందిరంగు మారిన బియ్యం 6 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గనుంది.

ఇందుకు గాను ప్రతికిలోకు అదనంగా రూ.1.10 వ్యయం. 30 పైసలు డిస్ట్రిబ్యూషన్‌ కోసం ఖర్చుపర్యావరణ హితంగా ఉండే 10 కేజీలు, 15 కేజీలు .

రీయూజబుల్‌  బ్యాగులు లబ్దిదార్లకు ఇవ్వనున్న ప్రభుత్వంమొత్తం సార్టెక్స్‌ చేయడానికి రూ.480 కోట్లు వ్యయం. డోర్‌ డెలివరీకి రూ.296 కోట్లు వ్యయం చేయనున్న ప్రభుత్వం. అదనంగా 776 కోట్లు ఖర్చు.

వై.ఎస్‌.ఆర్‌.బీమా కింద సామాజిక భద్రతా పథకం

సహజ మరణం పొందితే రూ.2 లక్షలు, 18–50 ఏళ్ల మధ్య వర్తింపుశాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు, 18–50 ఏళ్ల మధ్య వర్తింపు.

శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే బాధిత కుటుంబాలకు రూ.3 లక్షలు.

51–70 ఏళ్ల మధ్య వర్తింపుబియ్యం కార్డు ఉండి, కుటుంబం ఆధారపడ్డ వ్యక్తికి దురదష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగితే వర్తించనున్న వై.యస్‌.ఆర్‌. బీమా . రాష్ట్రంలో సుమారు 1కోటి 50 లక్షల బియ్యంకార్డు కుటుంబాలు.

ఎల్‌ ఐ సి, కేంద్ర ప్రభుత్వం  గత పథకాన్ని ఉపసంహరించిన నేపధ్యంలో ఈ కొత్త పథకాన్ని సొంత ఖర్చుతో తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వంఏడాదికి రూ.583.5 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం.

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 26 టీచింగ్‌ పోస్టులు, 14 నాన్‌ టీచింగ్‌ పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం.

వై.ఎస్‌.ఆర్‌ జిల్లా వేంపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 27 టీచింగ్‌ పోస్టులు, 8 నాన్‌ టీచింగ్‌ పోస్టులు మంజూరుకు కేబినెట్‌ ఆమోదం.

విశాఖ జిల్లా దిగువ సీలేరు జల విద్యుత్‌ కేంద్రంలో అదనంగా 2 యూనిట్లు115 మెగావాట్లు చొప్పున 2 యూనిట్లు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం/ దాదాపు రూ.510 కోట్లు వ్యయంతో ఏర్పాటుకు ఆమోదం.

వై.ఎస్‌.ఆర్‌ జిల్లా రాయచోటిలో కొత్త పోలీస్‌ సబ్‌ డివిజన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.

పులివెందుల సబ్‌డివిజన్ నుంచి రాయచోటి శివారు గ్రామాలు 120 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పాటు రాయచోటి జనాభా పెరిగిన నేపధ్యంలో ఈ కొత్త సబ్‌డివిజన్ ఏర్పాటుకు నిర్ణయం.

రాయచోటిలో కొత్త ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుకూ ఆమోదం.

వై.యస్‌.ఆర్‌ జిల్లాకు కొత్తగా 76 హోంగార్డు పోస్టులు మంజూరుకు మంత్రిమండలి ఆమోదం.
నూతన పారిశ్రామిక విధానం 2020–23 కేబినెట్‌ ఆమోదం.

తూర్పుగోదావరి జిల్లాలో  2000 ఎకరాల్లో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/