ఏపి సిఎం జగన్పై బిజెపి కన్నా లక్ష్మీ విసుర్లు
విజయవాడ: ఏపి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సిఎం జగన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాలనపై నమ్మకం లేక జగన్ అడ్డదారుల్లో వెళుతున్నారని ఆరోపించారు. ఇవాళ విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గంటగంటకు రిజర్వేషన్లలో మార్పులు చేయడం సరికాదని అన్నారు. పోలీసులు నిజాయతీగా పనిచేయాలని, వైఎస్ఆర్సిపి దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. కడప జిల్లా రాజంపేటలో ఎన్నికల బరిలో దిగితే ఎర్రచందనం కేసులు పెడతామని బెదిరిస్తున్నారని కన్నా ఆరోపించారు. కాగా ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో పార్టీల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/