ఏపి ప్రభుత్వంపై కన్నా ఫైర్‌

Kanna Lakshminarayana
Kanna Lakshminarayana

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తీరుపై ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన విరుచుకుపడ్డారు. అన్ని మతాలను సమానంగా ఆదరించాల్సిన ప్రభుత్వం, హిందూ మత సంస్థలు, ఆస్తులు, కార్యక్రమాలపై ఎందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది? అని ప్రశ్నించారు. ప్రణాళికాబద్ధంగా కుట్రకు పాల్పడుతోందని ఆరోపించారు. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని, అటువంటి ధర్మాన్నే భక్షించాలని చూస్తే బిజెపి ఎటువంటి పోరాటానికైనా సిద్ధమేనని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/