ఏపిలో 11రోజుల్లోనే కొత్తగా లక్ష కేసులు

ప్రభుత్వంపై దేవినేని ఉమ విమర్శలు

Devineni Uma Maheswara Rao
Devineni Uma Maheswara Rao

అమరావతి: ఏపిలో కొత్తగా లక్ష కేసులు నమోదుకావడం పట్ల టిడిపి నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఏపి ప్రభుత్వంపై మండిపడ్డారు. మూడు లక్షల కేసులు దాటిన రాష్ట్రంగా ఏపి మరో రికార్డు నమోదు చేసిందని విమర్శలు గుప్పించారు. ఏపి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవట్లేదని ఆయన విమర్శించారు. ‘3,06,261 కేసులు, 2,820 మరణాలు. దేశంలో మూడు లక్షల కేసులు దాటిన మూడో రాష్ట్రంగా రికార్డు. 11 రోజుల్లోనే మూడో లక్ష కూడా.. కేసుల పెరుగుదలలో మొదటిస్థానం. దేశంలో 10 వేల కేసులు దాటిన 50 జిల్లాలలో 13 మనవే. కరోనా వారియర్స్ తో మాట్లాడి ప్రజలకు మనో ధైర్యం కల్పించాలన్న చంద్రబాబు నాయుడి గారి మాటలు మీకు వినబడుతున్నాయా.. జగన్‌ గారు?’ అని దేవినేని ఉమా మహేశ్వరరావు ట్విట్టర్‌లో ప్రశ్నించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/