ఈనెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ప్రారంభమైన బీఏసీ సమావేశానికి సీఎం జగన్‌, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, అనిల్ కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు హాజరయ్యారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు హాజరయ్యారు.

నవంబర్‌ 26 వరకు అసెంబ్లీ సమావేశాలను కొనసాగించాలని టీడీపీ కోరగా.. టీడీపీ డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఈ నెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/