సభనుంచి స్పీకర్‌ తమ్మినేని వాకౌట్‌

Tammineni Sitaram
Tammineni Sitaram

అమరావతి: ఏపి అసెంబ్లీలో రెండో రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. టిడిపి సభ్యులు చేపట్టిన ఆందోళనకు సభ రసాభాసగా మారింది. దీంతో అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారం అసహనం వ్యక్తం చేశారు. సభ రెండో రోజ ప్రారంభమైనప్పటి నుంచి సభలో టిడిపి సభ్యులు ఆందోళనకు దిగారు. ఎస్‌సి కమిషన్‌ బిల్లుపై చర్చకు సభ్యులు అడ్డుతగిలారు. స్పీకర్‌ పోడియం వద్దకు చేరుకుని జై అమరావతి అంటూ నినదించారు. దీంతో స్పీకర్‌ తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రతిపక్షం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మనస్తాపానికి గురవుతున్నట్లు ప్రకటించి సభ నుంచి వాకౌట్‌ చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/