నవంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు తేదీ ఫిక్స్ చేసారు. నవంబర్ 18 నుండి సమావేశాలు మొదలుకాబోతున్నాయి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నట్లు గవర్నర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ అసెంబ్లీ స‌మావేశాలు నాలుగు లేదా ఐదు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. ఆ తర్వాత రాష్ట్రంలో నిర్వ‌హించే బోయే ఎన్నిక‌ల అనంత‌రం పూర్తి స్థాయిలో అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఈ అసెంబ్లీ స‌మావేశాల‌లోనే మండ‌లి ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్ ల‌ను కూడా ఎన్నుకునే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ సారి అసెంబ్లీ స‌మావేశాలు వాడీ వేడి గా సాగే అవకాశం ఉంది. ఇటీవ‌ల టీడీపీ జాతీయ కార్యల‌యం పై దాడి జ‌రిగింది. దీని పై చ‌ర్చించాల‌ని టీడీపీ ఎమ్మెల్యే లు ప‌ట్టు ప‌ట్టే అవకాశం ఉంది.