ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగవ రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను మొదలుపెట్టారు. అటు శాసనమండలి సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ రోజు అసెంబ్లీలో ప్రభుత్వం 15 బిల్లులను ప్రవేశపెట్టనుంది.
సినిమా రెగ్యులరైజేషన్ యాక్ట్తో పాటు పలు బిల్లులు సభ ముందుకు రానుంది. అలాగే బీసీ జనగణన చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు. శాసన మండలి రద్దు చేయాలన్న గత తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటూ నేడు తీర్మానం చేసే అవకాశం ఉంది. అలాగే మండలిలో పరిపాలనా వికేంద్రీకరణ ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఇంధన శాఖలో సంస్కరణలపై మండలిలో చర్చ జరుగనుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/