ఏపీ అసెంబ్లీలో మొత్తం 9 బిల్లులకు ఆమోదం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగిసాయి. మొత్తం 9 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బుధవారం మూజువాణి ఓటుతో తొమ్మిది బిల్లులను సభ ఆమోదించింది. ఈ బిల్లుల్లో ముఖ్యంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ని వైస్సార్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లును ఏపీ వైద్య, ఆరోగ్య మంత్రి విడుదల రజిని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దాంతో ఒక్కసారిగా విపక్ష టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. బిల్లు ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసినప్పటికీ , సభ ఆమోదం తెలిపింది.

అలాగే ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (సవరణ) బిల్లు 2022, ఆంధ్రప్రదేశ్ లేబర్ వెల్ఫేర్ ఫండ్ (రెండవ సవరణ) బిల్లు 2022, కార్మిక ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలశాఖ మంత్రి జీ జయరామ్ ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ జీతాలు, పెన్షన్ చెల్లింపులు, తొలగింపుల అనర్హత (సవరణ) బిల్లు 2002 కూడా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ బిల్లు 2022, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్‌కు నియామకాల నియంత్రణ, స్టాఫ్ ప్యాటర్న్, పే స్ట్రక్చర్ (సవరణ) బిల్లు 2022 కూడా ఆమోదం పొందింది. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (సవరణ) బిల్లు 2022, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ, ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీస్ (సవరణ) బిల్లు 2022, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాల (సవరణ) బిల్లు 2022 లను కూడా సభ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ విభజన (నం.3) బిల్లు 2022 ను కూడా సభ ఆమోదించింది.