తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలకు ఏపి ప్రభుత్వం లేఖ

మా బస్సులను అనుమతించండి ..ఏపి వినతి

APSRTC Busses
APSRTC Busses

అమరావతి: ఏపిలో 8వ తేదీ నుండి అంతర్రాష్ట్ర బస్సుసర్వీసులను నడిపించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈనేపథ్యంలో తమ రాష్ట్ర బస్సులను అనుమతించాలని ఏపి ప్రభుత్వం తరఫున సీఎస్ నీలం సాహ్ని, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలకు లేఖను రాశారు. ఇదే విషయాన్ని మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకూ తెలియజేసింది. తమిళనాడులో మాత్రం కేసుల సంఖ్య అధికంగా ఉండటంతో, ఆ రాష్ట్రం ఇతర రాష్ట్రాల వారిని అనుమతించేది లేదని స్పష్టంచేశారు.

కాగా, ప్రైవేటు వాహనాలు, రైళ్లలో భారీ ఎత్తున ప్రజలు వస్తుండటంతో, వారందరి వివరాలు సేకరించడం కష్టంగా ఉందని ఇటీవల ఏపి జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వం వద్ద వాపోయిన సంగతి తెలిసిందే. వెంటనే బస్సులను అనుమతించాలని వారు రవాణా శాఖను కోరారు. ఇక తెలంగాణ రాష్ట్రం అంతర్రాష్ట్ర ప్రయాణికులను అనుమతిస్తున్నప్పటికీ, బస్సుల విషయంలో మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ విషయంలో స్పష్టమైన విధానాన్ని తెలంగాణ ప్రకటించాలని ఏపి కోరుతోంది. ఈ విషయంలో మరో రెండు రోజుల్లో నిర్ణయం వెలువడవచ్చని, సోమవారం నుంచి బస్సులు తిరిగి ప్రారంభం అవుతాయని సమాచారం.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/