ఏపీలో త్వరలో మరో జిల్లా ఏర్పాటు ..
సోమవారం ఏపీలో కొత్త జిల్లాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు 13 జిల్లాల ఉన్న ఏపీ..నిన్నటి నుండి 26 జిల్లాలగా మారింది. అయితే ఇప్పుడు మరో జిల్లా ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. గిరిజన ప్రాంతాలను కలిపి ఒకే జిల్లాగా ఏర్పాటు చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా… రంపచోడవరం, పోలవరం ముంపు గ్రామాల తో కలిపి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని మంత్రి పేర్ని నాని ఈరోజు మీడియాకు తెలిపారు.
ప్రస్తుతం రంపచోడవరం…అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉండగా… జిల్లా కేంద్రం దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ వినిపిస్తుంది. మరి ఆ కొత్త జిల్లా దేనిని చేస్తారో చూడాలి. నిన్న ఉదయం 9 గంటల సమయంలో సీఎం జగన్ చేతుల మీదుగా 26 జిల్లాల పరిపాలన ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఇరవై ఆరు జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతలు చేపట్టారు. అలాగే ఏపీలో మార్కెట్ విలువలను పెంచుతూ రిజిస్ట్రేషన్ చార్జీల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది,