ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ తెలిపిన TSRTC
ప్రయాణికులకు నిత్యం ఏదొక గుడ్ న్యూస్ తెలుపు ఆనందపరుస్తున్న TSRTC తాజాగా మరో తీపి కబురును అందించింది. బస్సు బయులుదేరిన తర్వాత కూడా తమ ప్రయాణానికి 15 నిమిషాల ముందు ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకోవడంతో పాటు డిజిటల్ పేమెంట్స్ ద్వారా డబ్బులు చెల్లించే విధానాన్ని తీసుకరాబోతున్నట్లు తెలిపింది. మాములుగా అయితే బస్సు స్టార్ట్ కాకముందు వరకు మాత్రమే ప్రయాణికులు బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు తమ ప్రయాణానికి 15 నిమిషాల ముందు కూడా బుక్ చేసుకునే ఛాన్స్ ఇవ్వబోతుంది.
బస్సు బయులుదేరిన తర్వాత కూడా తమ ప్రయాణానికి 15 నిమిషాల ముందు ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకోవడంతో పాటు డిజిటల్ పేమెంట్స్ ద్వారా డబ్బులు చెల్లించే విధానాన్ని తీసుకొస్తోంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా 600 బస్సులలో ఐ టిమ్స్ అనే ఈ నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టగా.. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సులలో ప్రవేశపెట్టాలని తాజాగా టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. అన్ని సిటీ బస్సులతో పాటు జిల్లాలకు వెళ్లే సర్వీసులలో కూడా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది.