‘ఈటల’ పై సీఎం కు మరో ఫిర్యాదు

తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని సిఎస్కు కెసిఆర్ ఆదేశం

Etala-KCR
Etala-KCR

Hyderabad: మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై సీఎం కేసీఆర్ కు మరో ఫిర్యాదు అందింది. ఈటెల రాజేందర్ కుమారుడు నితిన్ రెడ్డి తన భూమి కబ్జా చేశారని ,తనకు న్యాయం చేయాలని కోరుతూ, మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామ నివాసి పీట్ల మహేష్ ముదిరాజ్ సీఎం కెసిఆర్ కు ఫిర్యాదుతో కూడిన దరఖాస్తు చేశారు.కాగా ఈ ఫిర్యాదు పై తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఏసీబీ విజిలెన్స్ శాఖ, రెవెన్యూ శాఖ, రెండు శాఖలు సమగ్ర దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/