ఏపిలో మరో 82 పాజిటివ్ కేసులు
మొత్తం కరోనా కేసులు 3,200
అమరావతి: ఏపిలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 12,613 శాంపిళ్లను పరీక్షించగా మరో 82 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 40 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 3,200 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 927 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,209 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 64కి చేరింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/