ఏపిలో మరో 425 కొత్త పాజిటివ్‌ కేసులు

Coronavirus
Coronavirus

అమరావతి: ఏపిలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో 425 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో 299 మందికి పాజిటివ్‌ రాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 100 మందిలో 26 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 7,496కి చేరింది. కరోనా వల్ల కృష్ణాజిల్లాలో ఇద్దరు మృతిచెందగా.. మొత్తంగా కరోనా మరణాల సంఖ్య 92 మందికి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 2,779 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,983 మంది డిశ్చార్జ్ అయ్యారు. 

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/