ఏపిలో మరో 34 కరోనా పాజిటివ్ కేసులు
473 కు చేరిన మొత్తం భాధితుల సంఖ్య
అమరావతి: రాష్ట్రంలో నిన్న రాత్రి నుంచి జరిపిన పరక్షలో కొత్తగా మరో 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రవ్యాప్తంగా కరోనా భాధితుల సంఖ్య 473 కు చేరిందని ఏపి ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా నమోదయిన కేసులలో కృష్ణా జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 7 అనంతపురం లో 2, గుంటూరులో 16, నెల్లూరులో ఒక కరోనా పాజిటివ్ కేసుల నమోదు అయింది. కాగా అత్యధికంగా గుంటూరు జిల్లాఓ 109 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లాలో 90 మందికి కరోనా సోకింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/