నగరంలో మరో 227 బస్తీ దవాఖానాలు

Minister KTR
Minister KTR

హైదరాబాద్‌: తెలంగాణ ఐటీ, పుర పాలక శాఖ మంత్రి కెటిఆర్‌ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జిహెచ్‌ఎంసి) పరిధిలో కొత్తగా మరో 227 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నిర్వహణలో ఉన్న 123 బస్తీ దవాఖానాలకు తోడు మరో 227 బస్తీ దవాఖానాలకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆమోదం తెలిపినట్లు మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో మొత్తం బస్తీ దవాఖానాల సంఖ్య 350కి చేరుతుందన్నారు. రానున్న మూడు నెలల్లో ఈ దవాఖానాలు హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి రానున్నట్లు మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/