తెలంగాణలో మరో 1,550 కొత్త కేసులు
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 926 కేసులు
హైదరాబాద్ :తెలంగాణాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. సోమవారం కొత్తగా 1,550 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో సోమవారం 9 మంది చనిపోయారు. ఇప్పటివరకూ 36 వేల 221 కేసులు నమోదు కాగా 365 మంది చనిపోయారు. ఇంకా 11, 178 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. తాజాగా 1,197 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 23,679 మంది డిశ్చార్జి అయ్యారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/