ఏపి హోంమంత్రికి సొంత పార్టీలోనే నిరసన సెగ
సుచరిత ఇంటి వద్దకు భారీగా తరలి వచ్చిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు
అమరావతి: ఏపి హోంమంత్రి సుచరితకు సొంత పార్టీలోనే నిరసన సెగ తగిలింది. ఈరోజు ఉదయం ఆమె ఇంటి వద్దకు భారీగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు తరలి వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 27వ డివిజన్ టికెట్ ను రౌడీషీటర్, కబ్జాదారుడైన వ్యక్తికి ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. పార్టీకోసం శ్రమించే యోగేశ్వర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసనల నేపథ్యంలో భారీ సంఖ్యలో అక్కడకు చేరకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/