రివ్వున ఎగిరి నట్టు కలలో తేలిపోతున్నారు!

పరమ అవమానకరంగా పరాజయం పాలై ఆరు నెలలు తిరగక ముందే చిటికెలు వేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మరియు టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై వైఎస్సాఆర్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉత్త పుత్రుడు, దత్తపుత్రుడు పచ్చ మీడియా అనే కీలు గుర్రం ఎక్కి స్వారీ చేస్తున్నారని దుయ్యబట్టారు. రివ్వున ఎగిరనట్టు కలల్లో తేలిపోతున్నారు. పరమ అవమానకరంగా పరాజయం పాలై ఆరు నెలలు తిరగక ముందే చిటెకెలు వేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ఎవరైనా చెప్పండయ్యా పవన్‌ కళ్యాణ్‌కు వెకిలి చేష్టలతో పరువు తీసుకొవద్దని విజయసాయి రెడ్డి సూచించారు. ఇంకా మరో ట్వీట్‌లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. ప్రధానులను డిసైడ్‌ చేశాను. రాష్ట్రపతులను సెలక్ట్‌ చేశానని డప్పుకొట్టుకునే వ్యక్తి ఇన్‌ సైడర్‌ భూములు కాపాడుకునేందుకు దిగజారి మాట్లాతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు వైజాగ్‌లో ఎగ్జిక్యూటివ్‌ రాజధాని కోరుకోవడం లేదట. కర్నూలు వాళ్లు జ్యూడీషియల్‌ క్యాపిటల్‌ వద్దేవద్దని ఈయన చెవిలో చెప్పారట అని చంద్రబాబును దుయ్యబట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/