వారికి చట్ట సభలు అంటే గౌరవం లేదు
రాష్ట్రంలో మండలి పరువు మంటగలిపారు
అమరావతి: వైస్సార్సిపి నాయకులకు చట్ట సభలు అంటే గౌరవం లేదని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. వైఎస్సార్సిపి సభ్యులు అసంబ్లీలో రౌడీల్లా ప్రవర్తించారు. మండలి పరువు మంట గలిపారు అని లోకేష్ దుయ్యబట్టారు. ఆఖరికి పార్లమెంట్ని కూడా వదలలేదు వైఎస్సార్సిపి ఎక్కడైనా రైడీయిజమే ప్రదర్శిస్తుందని విమర్శించారు. సాటి సభ్యుడిపై దాడికి యత్నించారంటేనే వారి ఉన్మాధ స్థాయి అర్థమవుతుందని అన్నారు. ఇదే గుండాయిజంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించొచ్చు కదా! నారా లోకేష్ సూచించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/