విశాఖలో వైసీపీ రౌడీయిజం: యనమల
Visakhapatnam: విశాఖలో వైసీపీ రౌడీయిజం చేయిస్తోందని ఏపీ మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… విశాఖ ప్రజలపై వైసీపీ నేతలు అబాండాలు వేస్తున్నారన్నారు.
చెప్పులు, టమాటాలు, గుడ్లు విసిరింది విశాఖ వాసులు కాదన్నారు. వైసీపీ రౌడీయిజంతో విశాఖకు పెట్టుబడులు రావడం లేదన్నారు. ఈనెల 27న జరిగిన సంఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/movies/