సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం
టిడిపి పార్టి ఆఫిసులో మీడియా సమావేశం
అమరావతి: ఎన్నికల వాయిదాపై ఎస్ఈసిని సమర్ధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని స్వాగతిస్తున్నట్లు టిడిపి మాజీ మంత్రి అచ్చేన్నాయుడు చెప్పారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ తన వైఖరిని మార్చుకోవాలని సూచిస్తూ, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఏం సమాదానం చెబుతారని, ఎస్ఈసికి కులాన్ని ఆపాదించిన జగన్ ఇపుడు ఎవరికి కులాన్ని ఆపాదిస్తారని, కరోనా వైరస్పై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటని ప్రశ్నించారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న కారణంగా దేశంలో పలు రాష్ట్రాలలో స్థానిక ఎన్నికలు వాయిదా వేయగా, ఎపిలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్ఈసి నిర్ణయించింది. దీనిని వ్యతిరేఖిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/