విశాఖకు జైకొడితేనే..ముందుకు కదలనిస్తాం

ఉత్తరాంధ్రలో చంద్రబాబుకు నిరసన సెగలు

visakhapatnam-people-protest-against-chandrababu-naidu
visakhapatnam-people-protest-against-chandrababu-naidu

విశాఖపట్టణం: అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు అంటున్న చంద్రబాబు నాయుడు విశాఖకు ఎందుకు వచ్చారంటూ ఉత్తరాంధ్ర వాసులు చంద్రబాబును నిలదీశారు. నేడు అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఉత్తరాంధ్రలో ఊహించిన పరిణామం ఎదురైంది. పరిపాలనా రాజధానిగా విశాఖ ప్రకటనను వ్యతిరేకిస్తూ..గురువారం ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన ఆయనకు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన సెగలు వ్యక్తమయ్యాయి. చంద్రబాబు ప్రయాణిస్తున్న మార్గంలో దాదాపు నాలుగు గంటల పాటు వేలాది మంది ప్రజలు, ప్రజా సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించి ఆయన కాన్వాయ్‌ ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ..అమరావతిలో టిడిపి నేతలు ఆక్రమించిన భూములను, ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారని విమర్శించారు. మరోవైపు విశాఖ అభివృద్ధికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడిని ఇక్కడి నుంచి కదలనిచ్చే ప్రసక్తేలేదని మహిళలు రోడ్డుపై బైఠాయించారు. విశాఖకు జై కొడితేనే ఆయన కాన్వాయ్‌ని కదలనిస్తామని మహిళలు స్పష్టం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/