భూకుంభకోణం నుంచి పక్కదారి పట్టించడానికి ప్రయత్నాలు

దృష్టి మరల్చడానికి చంద్రబాబు లేని ఎజెండాను ఎత్తుకున్నాడు..విజయసాయిరెడ్డి

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: ఏపిలో దేవాలయాలపై వరుసగా జరుగుతోన్న దాడులపై టిడిపి నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేస్తోన్న వ్యాఖ్యల పట్ల వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ‘భూకుంభకోణం నుంచి దృష్టి మరల్చడానికి లేని ఎజెండాను ఎత్తుకున్నాడు చంద్రబాబు. విజయవాడలోనే డజన్ల కొద్ది ఆలయాలను కూలగొట్టాడు.  బిజెపి కొన్ని వర్గాలకు వ్యతిరేకమంటూ ఎన్నికల ముందు నానా హంగామా చేశాడు. కశ్మీర్ నుంచి కూడా నాయకులను తీసుకొచ్చి ప్రచారం చేసిన విషయాన్ని ఎవరూ మర్చిపోరు’ అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/