చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేసిన ఎంపీ

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉన్న చంద్రబాబు నాయుడు తన నమ్మకస్థులను పంపి ఆహ్వానం సంపాందించేవారని విమర్శించారు. ప్రస్తుతం చంద్రబాబు ఎన్డీఏలో లేకపోయినా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారానికి వెళ్లే దమ్ము లేదన్నారు. బిజెపి పెద్దల కంట్లో పడితే పాత కేసులు ఎక్కడ తిరగతోడుతారో అని చంద్రబాబు వణుకుతున్నారని అన్నారు. అప్పట్లో గిరగిరా తిప్పిన చక్రాలు ఇప్పుడు ఏమయ్యాయో అని ఎద్దేవా చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/