చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు

మరి సొంత ఎమ్మెల్యేలతో ఓటు వేయించుకోలేకపోయారేంటీ?

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి టిడిపి అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ‘కింద జాకీలు, పైన క్రేన్లతో ఆకాశానికెత్తిన ఎల్లో మీడియా బాబు గారికి తగిలించిన బిరుదులివి. చాణక్యుడు, వ్యూహకర్త, దేశ రాజకీయాలను బొంగరంలా తిప్పిన ఉద్దండుడు, 20-30 ఏళ్ల ముందస్తు ఆలోచనలు చేసిన విజనరీ. మరి సొంత ఎమ్మెల్యేలతో ఓటు వేయించుకోలేక బొక్కబోర్లా పడ్డాడేమిటి? ఏమిటీ పరాభవం?’ అని విజయసాయిరెడ్డి విమర్శించారు.

కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ‘కరోనా కష్ట కాలంలోనూ మాట తప్పకుండా హామీలను అమలు చేస్తున్నారు యువ ముఖ్యమంత్రి. 80 వేలకు పైగా నేతన్నల కుటుంబాలకు లబ్ది. జగన్ గారి చేతుల మీదుగా వైఎస్ఆర్ నేతన్న నేస్తం ప్రారంభం. ఆర్నెల్లు ముందుగానే నేతన్నల ఖాతాల్లో డబ్బు జమ. మాటల్లో కాదు, చేతల్లో నిజమైన బడుగుల పార్టీ వైఎస్‌ఆర్‌సిపి ‘అని చెకొచ్చారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/