చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు

ఆ హింసాగ్నిలో చలి కాచుకునే చరిత్ర చంద్రబాబుదే

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: నిన్న అసెంబ్లీలో ఏపి ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ప్రతి దానికి కులానికి లింకుపెట్టే చంద్రబాబు నాయుడు ఈ అంకెలు చూడు అర్థమవుతుంది. బీసీ, ఎస్‌సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి సిఎం జగన్‌ ‌ ప్రభుత్వం కట్టుబడ్డది. కులాలను రెచ్చగొట్టి, ఆ హింసాగ్నిలో చలి కాచుకునే చరిత్ర చంద్రబాబుదే. బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు 68.18 శాతం, కాపులకు 42.35 శాతం, మైనార్టీలకు 116 శాతం పెంచారు’ అని ఆయన వివరించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/