వెలిగల్లు ప్రాజెక్టు పేరు మార్పు.. ఏపి ప్రభుత్వం
వైఎస్ఆర్ వెలిగల్లు రిజర్వాయరుగా మారుస్తూ ఉత్తర్వులు
కడప: కడప జిల్లాలోని వెలిగల్లు ప్రాజెక్టు పేరును వైఎస్ఆర్ వెలిగల్లు రిజర్వాయరుగా మారుస్తూ ఏపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఈ ప్రాజెక్టును వైఎస్ఆర్ వెలిగల్లు ప్రాజెక్టుగా వ్యవహరించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రత్యేక వాహక సంస్థను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ మేరకు అనుమతులు మంజూరు చేసింది. రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టుల అభివృద్ధి సంస్థ పేరుతో ఎస్పీవీ ఏర్పాటు చేయాలని నిర్ణయించి జలవనరుల శాఖ నుంచి రూ. 5 కోట్ల పెట్టుబడి మంజూరుకు ఆదేశించింది. ఈ సంస్థ ద్వారా రూ. 40 వేల కోట్లను ఖర్చు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్కు అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/