సరిహద్దుల్లో భారీగా నిలిచిన వాహనాలు
కర్నాటకలోకి నో ఎంట్రీ
Anantapur: కొడికొండ చెక్ పోస్టు వద్ద ఏపీకి చెందిన వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
ఏపీ అధికారులు ఇచ్చిన పాస్లు చెల్లవని కర్ణాటక పోలీసులు చెప్పడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన పాస్లు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు.
మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నవారిని సైతం కర్ణాటకకు వెళ్లకుండా అడ్డుకోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు కర్ణాటక వాహనాలు మాత్రం యధేచ్చగా ఏపీలోకి ప్రవేశిస్తున్నాయి.
కర్ణాటక అధికారుల తీరుపై ఏపీ పోలీసులు స్పందించకపోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/