హిందూ ధర్మ వ్యాప్తికి టిటిడి పెద్దపీట వేస్తుంది

దేశవ్యాప్తంగా టిటిడి కార్యక్రమాలు నిర్వహిస్తాం

y v subba reddy
y v subba reddy

మండపేట: హిందూ ధర్మ వ్యాప్తికి టిటిడి పెద్దపీట వేస్తుందని టిడిడి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా టిటిడి కార్యక్రమాలు విస్తరిపంజేస్తామని, స్వామి కళ్యాణాలతో పాటు ప్రతి నెలా వేదసభలను నిర్వహిస్తామని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం అర్తమూరులో బుధవారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమంలో సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న జీయర్‌స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అందరికి సేవచేసే భాగ్యం రాదని వచ్చిన వారు మంచి పాలన అందించాలని హితవు పలికారు. కులమతాలు, పార్టీలకతీతంగా పాలన అందించాలని సూచించారు. ఉపముఖ్యమంత్రి పిల్లిసుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పాలన సక్రమంగా సాగాలని, ప్రజలకు మేలు జరిగేలా ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో మంత్రులు మోపిదేవి వెంకటరమణ, కురసాల కన్నబాబు, పినిపే, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/