తెలుగు రాష్ట్రాల నుండి రాకపోకలు సాగించే రైళ్ల వివరాలు..

అన్ని టికెట్ల విక్రయాలు ఆన్‌లైన్‌లోనే

train
train

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా జూన్‌ 1వ తేదీ నుండి 200 రైళ్లను నడిపేందుకు కేంద్రం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ రైళ్ల రాకపోకలు, యే రూట్లలో నడుస్తాయి, ప్రయాణ వేళలు అన్న వివరాలను నిన్న రాత్రి రైల్వే బోర్డు ఖరారు చేసి ఆ వివరాలను అన్ని జోన్ల జీఎంలకు పంపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రూట్లను ఎంపిక చేశారు. కాగా నేటి నుంచే టికెట్ల బుకింగ్ ప్రారంభం కానుండగా, స్లీపర్ బోగీల్లో రిజర్వేషన్లు పూర్తయిన తర్వాత 200 టికెట్లను వెయిటింగ్ లిస్టులో జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు నడిపిన ప్రత్యేక రైళ్లలో జనరల్ బోగీలు లేకపోగా, జూన్ 1 నుంచి నడపనున్న రైళ్లు సాధారణ రైళ్లలాగా, ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని అధికారులు తెలిపారు. అలాగే, స్టాపులు కూడా గతంలో మాదిరిగానే ఉంటాయి.


రైల్వే నడపనున్న 200 రైళ్ల వివరాలు..

•ముంబై హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్ (02701/02)
• హౌరాసికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (02703/04)
• హైదరాబాద్-న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ (02723/24)
• దానాపూర్సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్‌ప్రెస్ (02791/92)
• విశాఖపట్టణం ఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ (02805/06)
•గుంటూరుసికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ (07201/02)
• తిరుపతినిజామాబాద్ రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (02793/94),
• హైదరాబాద్విశాఖపట్టణం గోదావరి ఎక్స్‌ప్రెస్ (02727/28)

• వీటితోపాటు సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ (02285/86) రైలును వారానికి రెండుసార్లు నడపనున్నారు.

• హౌరా-యశ్వంత్‌పూర్ దురంతో ఎక్స్‌ప్రెస్ (02245/46) ఇది వారానికి ఐదు రోజులు నడుస్తుంది. అలాగే, ముంబై సీఎస్‌టీభువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (01019/20) రైళ్లు సికింద్రాబాద్, విజయవాడ మీదుగా నడుస్తాయి. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రోజూ నడుస్తుంది.


కాగా ఈ రైళ్లలో సాధారణ బోగీలు ఉన్నప్పటికీ వాటికీ రిజర్వేషన్ ఉంటుంది. అంటే రైలులోని అన్ని బోగీలు రిజర్వేషనే అన్నమాట. జనరల్ కోచ్‌లో ప్రయాణించే వారి నుంచి ద్వితీయ శ్రేణి సీటింగ్ రుసుమును వసూలు చేస్తారు. టికెట్లు అన్నింటినీ ఆన్‌లైన్‌లోనే తీసుకోవాలి. రైల్వే స్టేషన్‌లో టికెట్లు విక్రయించరు. నెల రోజుల ముందుగా కూడా టికెట్లను రిజర్వు చేసుకునే వీలుంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/