రేపు టీటీడీ పాలకమండలి కీలక భేటి

టీటీడీ పాలకమండలి చరిత్రలో మొదటిసారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం

tirumala temple
tirumala temple

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం గురువారం జరుగనుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో టీటీడీ పాలకమండలి చరిత్రలో మొదటిసారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని టీటీడీ నిర్వహిస్తోంది. తిరుమల నుంచి సమావేశానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఎక్స్ ఆఫీసియో సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితుడు కరుణాకర్‌రెడ్డి హాజరుకానున్నారు. కాగా, మిగిలిన సభ్యులు వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా హాజరవుతారు. అయితే ఈ సమావేశంలో 60 అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. టీటీడీ ఆస్తుల విక్రయంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆస్తుల విక్రయంపై స్వామీజీల అభిప్రాయాలు తీసుకుని కమిటీ వేయడానికి టీటీడీ నిర్ణయం తీసుకోనుంది. లాక్‌డౌన్ అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి శ్రీవారి దర్శనాలకు అనుమతి వస్తే ఎలాంటి ఏర్పాట్లు చేపట్టాలనే అంశంపైనా చర్చించనున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/