చంద్రబాబు ర్యాలీకి అనుమతి రద్దు

పలువురు నేతల హౌస్ అరెస్ట్

Chandrababu
Chandrababu

తిరుపతి: టిడిపి అధినేత చంద్రబాబు ఏపి రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఈరోజు తిరుపతిలో ఐక్య కార్యాచరణ సమితి ర్యాలీ లో పాల్గొన్నారు. అయితే, ర్యాలీకి పోలీసులు అనుమతిని నిరాకరించారు. పండుగ సీజన్ కావడంతో అనుమతిని నిరాకరిస్తున్నట్టు తిరుపతి అర్బన్ ఎస్పీ తెలిపారు. మరోవైపు, చంద్రబాబు పర్యటన నేపథ్యంలో, పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టారు. చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు టిడిపి నేతలను గృహ నిర్బంధం చేశారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ ఛైర్మన్ నరసింహయాదవ్, ఐతేపల్లిలో మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇక ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే, చంద్రబాబు ఈ మధ్యాహ్నం 12.45 గంటలకు హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి రేణిగుంటకు బయల్దేరుతారు. 2.10 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తిరుపతిలోని పూలే విగ్రహం వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి నాలుగు కాళ్ల మంటపం వరకు అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు అక్కడ నిర్వహించే బహిరంగసభలో ప్రసంగించాల్సివుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/