ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే వార్త

iyr krishna rao
iyr krishna rao

అమరావతి: టిడిడి కి చెందిన నిధులను ఇతర ప్రభుత్వ కార్యకలాపాలకు మళ్లిస్తున్నారంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తను ఏపీ ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ఇది పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించే వార్త అన్నారు. దేవాదాయ శాఖ క్రింద చిన్న దేవాలయాలకు అర్చకులకు సహాయం కోసం ట్రస్టులు ఉన్నాయి. వాటికి టిటిడి మిగిలిన పెద్ద దేవాలయాలు నిధులు ఇవ్వటం చట్టంలోనే ఉందని ఐవైఆర్‌ తెలిపారు. టిడిడి ఎప్పుడు దీనిని ఉల్లంఘిస్తూ ఉంటుందన్నారు. సంతోషం ఈ సారైనా తగిన విధంగా నిధులు ఇవ్వాలని టిడిడి నిర్ణయించడం సంతోషకరమని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/